ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి​ : అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీనివాస్​రెడ్డి

 ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి​ : అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీనివాస్​రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు :  ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాస్​రెడ్డి, డి.వేణుగోపాల్​ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీవెన్స్​లో వచ్చిన ప్రతీ దరఖాస్తునూ పరిశీలించి త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బి. సీతమ్మ, షేక్ రజియా సుల్తానా, ఎం.సావిత్రి తమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు  మొదటి దశలోనే ఇప్పించాలని వినతి ప్రతం ఇచ్చారు.

బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన పి. రాంబాబు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విచారణ చేయాలని కోరారు. తల్లాడ మండలం బాలప్పేట గ్రామానికి చెందిన జి. వీరయ్య తాను 2008 నుంచి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సీనియర్ మేట్ గా పని చేస్తున్నానని,  తనకు ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉపాధి కల్పించాలని దరఖాస్తు ఇచ్చాడు. ఖమ్మంలో డీఆర్వో ఏ. పద్మశ్రీ, డీఆర్డీవో ఎన్. సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, డీడీ కస్తాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఆఫీస్​లో...:

కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో ఎస్పీ బి. రోహిత్​రాజు గ్రీవెన్స్​ నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.